ADB: చెడు వ్యసనాలకు బానిస కాకుండా భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహించిన శబరిమాత రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.