SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ శనివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, పేస్కేల్ వెంటనే ఇవ్వాలని, టీ తాగే లోపు జీవో ఇస్తామన్న రేవంత్ రెడ్డి మీ హనుమకొండ హామీ ఏమయిందని ప్రశ్నించారు.