KNR: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయనామ సంవత్సరం అని ప్రకటించి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కోత పెట్టడం విస్మరించడమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి విమర్శించారు. శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయనామ సంవత్సరంగా ప్రకటించిన CM బడ్జెట్లో మాత్రం కోత విధించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.