MDK: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు జిల్లా అధికారులు అందుబాటులో ఉండరన్నారు. కేవలం హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే ప్రజావాణి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.