WGL: గీసుకొండ మండలం శ్రీ కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మార్చి 9 వరకు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 3 నుంచి 7వరకు వరకు జరిగే ప్రధాన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే జాతరకు సమయం దగ్గర పడుతున్నా రూ.1.45 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.