NRML: ఈ నెల 15న నిర్వహించే గ్రూప్ -2 పరీక్షకు నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పరీక్ష జరుగుతుందని పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలను అభ్యర్థులు పాటించాలని పేర్కొన్నారు.