MDCL: బోడుప్పల్ కార్పొరేషన్ లక్ష్మీగణపతి కాలనీ వాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. కృతికా ఇన్ఫ్రా కంపెనీ “డెవలప్మెంట్” పేరుతో 3 ఎకరాల భూమిని తీసుకొని, 25 ఫీట్ల లోతు తవ్వి వదిలేశారని వెల్లడించారు. దీంతో వర్షాకాలంలో ఆ గుంటలు నీటితో నిండిపోతూ, ప్రహరి గోడలకు ఆనుకొని ఉన్న ఇళ్లకు ప్రమాదకరంగా మారిందన్నారు.