E.G: పనిగంటలు పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించడంపై నిరసిస్తూ త్వరలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కేశవరం బాటిలింగ్ యూనిట్ స్టాఫ్ & వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు. ఆదివారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలులో జరిగిన యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల కార్మికులపై పనిభారం మోపెందుకే పని గంటల పెంపు అని మండిపడ్డారు.