E.G: పుల్లలపాడు వద్ద నడిచి వెళ్తున్న భవాని భక్తులు కారు ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దసరా సమయంలో వందలాది భక్తులు తన నియోజకవర్గం మీదుగా విజయవాడకు వెళ్తుంటారని తెలిపారు. భక్తులు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా యాత్ర సాగేలా తగు అవగాహన కల్పించాలని అధికారులకు,నాయకులకు సూచించామని ఆయన వెల్లడించారు.