VZM: డెంకాడలో వైసీపీ డిజిటల్ బుక్ను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎటువంటి అన్యాయాలు జరిగినా డిజిటల్ బుక్లో నమోదు చేయాలని పిలుపునిచ్చారు.