E.G: గోదావరి వరదల కారణంగా తూ.గో జిల్లాలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల రక్షణకు ప్రతి శాఖ సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆదేశించారు. బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.