SKLM: ఐక్య పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యమని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు అన్నారు. ఆదివారం సీఐటీయూ మండల మహాసభ మందసలో నిర్వహించారు. ముందుగా మెయిన్ రోడ్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను యాజమాన్యాలు అమలు చేయడం లేదని, కార్మికులకు భద్రత లేకుండా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.