MDK: సంవత్సరానికి రూ. 2000 చెల్లిస్తే రూ. 40 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని SBI రీజినల్ మేనేజర్ మారుతి తెలిపారు. సోమవారం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమేష్ అనే వ్యక్తి కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ. 40 లక్షల చెక్కు అందజేశారు. SBI ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SBI మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.