NDL: అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం వెంటనే ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నందికోట్కూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఇళ్లులేని వారితో కలిసి ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఇందులో ఏఐఎస్ఏ, ఏఐటీయూ, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.