KMM: కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామంలో సంతకం ఫోర్జరీ చేసి 3.11 ఎకరాల భూమిని కాజేయాలని చూసిన వ్యక్తిపై కూసుమంచి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మెడకంటి దమయంతికి వారి తల్లిదండ్రులు పసుపు కుంకుమలు కింద ఇచ్చిన భూమిని గొల్లగూడెం గ్రామానికి చెందిన మెడకంటి రాజశేఖర్ రెడ్డి కాజేయాలని చూడటంతో కేసు నమోదు చేశారు.