BHPL: గణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై, విద్యార్థులు, గురువులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని, ఆయన అన్నారు.