కోనసీమ: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. గ్రామ సర్వేయర్లు సోమవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలియజేశారు. ఆలమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం గ్రామ సర్వేయర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుంచి రెవెన్యూ శాఖకు అనేక విధాలుగా సేవలు అందిస్తున్నామని తెలియజేస్తూ తహసీల్దార్కి వినతిపత్రం ఇచ్చారు.