మెదక్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలు దోపిడీని అరికట్టాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో డీఈవో రాధాకిషన్కు వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, విద్యార్థుల తల్లిదండ్రులపై భారాన్ని మోపుతున్నాయన్నారు. ఇలాంటి పాఠశాలలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.