కోనసీమ: రావులపాలెంలో శ్రీ సత్య సాయి సేవ కేంద్రం నందు మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటలు నుండి ఉచిత కంటి, ఆయుర్వేద, మధ్యాహ్నం మూడు గంటలు నుండి ఉచిత ఈఎన్టి, ఎముకలు, కీళ్ళు, చిన్న పిల్లల వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని అన్నారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.