NLR: కలువాయి మండలంలోని దాచూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM, ఉపాధ్యాయులు ఇవాళ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెరమకొండ, దాసరపల్లి, ముక్కుతిప్ప గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాల్సిందిగా తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ ఛైర్మన్ పాల్గొన్నారు.