KMM: 10వ తరగతి అర్హతతో మహిళలకు డ్రోన్ శిక్షణను టేకులపల్లి మహిళా ప్రాంగణంలో ఇస్తున్నామని జిల్లా మహిళా ప్రాంగణాధికారిణి విజేత తెలిపారు. పంటలకు పిచికారి చేయుటకు డ్రోన్లు ఉపయోగపడుతాయని చెప్పారు. డ్వాక్రా మహిళలు శిక్షణ తీసుకుంటే వారికి డ్రోన్ పరికరాలను సబ్సీడీలో అందిస్తామన్నారు. ఆసక్తి గల మహిళలు టేకులపల్లిలో ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.