VSP: విశాఖలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే.రాజు ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, తక్షణమే యువతకు నెలకు రూ.3,000 భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలన్నారు.