KMM: ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన ఉంటుందని మాజీ ఎంపీటీసీ నండ్ర ప్రసాద్ అన్నారు. సోమవారం ఖమ్మం రూరల్(మం)వెంకటాయపాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన టై, బెల్టులను విద్యార్ధులకు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పేర్కొన్నారు.