AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. జగన్ పర్యటనలో పోలీసుల వైఫల్యం కనిపించిందని పేర్కొన్నారు. ప్రమాదంలో ఒకరు చనిపోయిన మాట వాస్తవమన్నారు. సింగయ్య మృతిపై ఎస్పీ మాట మార్చారని, జగన్ కాన్వాయ్ కంటే ముందు వెళ్లిన వాహనం సింగయ్యను ఢీకొట్టిందని.. ఈ విషయం ఎస్పీనే చెప్పారని గుర్తుచేశారు.