BHPL: బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రం సమీపంలోని కృష్ణా నది మధ్యలో ఉన్న నిజాంకొండ పర్యాటకులను ఆకర్షిస్తోంది. నిజాం నవాబుల కాలంలో శత్రువుల కదలికలపై నిఘా కోసం ఈ ద్వీపాన్ని సైనిక స్థావరంగా ఉపయోగించేవారు. నదీజలాలు, పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఈ కొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గద్వాల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.