PDPL: ధర్మారం మండలంలో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న SSC పరీక్ష నిర్వహణకు 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. మొత్తం 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. 51 మంది ఇన్విజిలేటర్లు, ఐదుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు డిపార్ట్మెంటల్ అధికారులు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్స్ను నియమించినట్లు తెలిపారు.