వనపర్తి మండలం రాజనగరం పీఎస్సీఎస్ రైతులకు పంపిణీకి 450 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని సీఈవో మహేందర్ తెలిపారు. ఈరోజు 10:30 గంటలకు యూరియా బుకింగ్ యాప్ ఓపెన్ అవుతుందని, అవసరం ఉన్న రైతులు బుకింగ్ చేసుకుని యూరియా పొందాలని కోరారు. యూరియా తీసుకునేందుకు రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్లతో రావాలని సూచించారు.