HYD: సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, ఈగల్ బృందం, రైల్వే రక్షణ దళం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులు దీపక్ సాహు(26), దీపక్ గౌడ(20)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10.089 కిలోల గంజాయి (విలువ రూ.5,04,450)తో పాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాయిశ్వర గౌడ్, మాధవ్ పాల్గొన్నారు.