MBNR: జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి సౌత్ జోన్ ఆలిండియా వాలీబాల్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలను ఈనెల 26న నిర్వహించనున్నట్లు మంగళవారం వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు తెలిపారు. వయస్సు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో (ప్రిన్సిపల్ సంతకంతో), క్రీడా దుస్తులతో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొంటారు.