KMM: ఖమ్మం నగరంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రంజిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మంత్రి తుమ్మల ముస్తఫానగర్లో బీసీ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అధికారులు గమనించాలని పేర్కొన్నారు.