NZB: డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. మెండోరా గ్రామానికి చెందిన సందేశ్బాబు అనే వ్యక్తి మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సమాయాన్ని వృథా చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్మూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. నాలుగురోజుల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చారని ఎస్సై సుహాసిని తెలిపారు.