SRPT: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి 80కి పైగా అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.