GDWL: గట్టు మండలం పర్యటనకు రేపు మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే.అరుణలు రానున్నట్లు జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి గురువారం తెలిపారు. అక్కడ అధికారిక కార్యక్రమంలో పాల్గొని మూడు గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొని 4.30కు ఎంపీ అరుణ ఇంటి వద్ద తేనీటి విందులో పాల్గొంటారని తెలిపారు.