HYD: ఫూల్బాగ్లో నిర్వహించిన టైగర్ నరేంద్ర మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్-2024 సీజన్-4ను గురువారం గౌలిపుర డివిజన్ కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత చదువులోనే కాకుండా క్రీడలవైపు కూడా ఆసక్తి కనబరచాలని సూచించారు. క్రీడల్లో మంచిగా రాణిస్తే ఉన్నతస్థాయికి ఎదగవచ్చని తెలిపారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.