WNP: పానగల్ మండలంలోని రేమద్దుల గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు దీక్షా శిబిరాన్ని గురువారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.