MHBD: కొత్తగూడ మండలంలోని ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. మారుమూల గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవకుండా ఉండాలనే లక్ష్యంతో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపి రూ. 5 కోట్ల నిధులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఇవాళ మంత్రి సీతక్క చిత్రపటానికి విద్యార్థులు, యువత, పాలాభిషేకం చేశారు.