SRPT: ఎన్నికల సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో 35 మందిని బైండోవర్ చేసినట్లు సీఐ చరమంద రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.