MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో బుధవారం వన దుర్గమ్మకు ఏకాదశి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళహారతి నీరాజనం చేశారు. జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తెల్లవారి నుండి ఆలయానికి తరలివస్తున్నారు. స్థానిక నది పాయలో పుణ్యస్నానం చేసి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు.