అనంతపురం: ధర్మవరం రూరల్ పరిధిలోని గరుడంపల్లి క్రాస్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్న చిన్న గాయలతో ప్రయాణికులు బయట పడ్డారు. ఢీ కొన్న కార్లు కొత్తచెరువు, పుట్టపర్తికి చెందినవిగా గుర్తించారు. క్షతగాత్రులను ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.