బాపట్ల: జిల్లాలో రాబోయే రెండు మూడు గంటల్లో ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని కలెక్టర్ జె.వెంకట మురళి హెచ్చరించారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. పిడుగుల ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రధాన కేంద్రాల్లో ఉండాలని ఆదేశించారు.