కడప: మండలంలోని వంతాటిపల్లి గ్రామంలో వేరుశనగ విత్తన శుద్ధి ప్రాముఖ్యతపై గ్రామీణ అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు రైతులకు వివరించారు. కిలో విత్తనానికి ఒక గ్రాము మ్యాంగో జెబ్, 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి మందును పట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.