HYD: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నామని గౌలిపుర డివిజన్ కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఇటీవల డ్రైనేజీ ఓవర్ ఫ్లోపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.