KMR: ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ‘నీటి ప్రతిజ్ఞ’ చేయించారు. నీటిని పొదుపుగా వాడుతామని, భవిష్యత్తు తరాలకు జల వనరులను భద్రంగా అందిస్తామని ఈ సందర్భంగా అధికారులు ప్రమాణం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నీరు అత్యంత విలువైన ప్రకృతి వనరు అని అన్నారు