ADB: జాతీయ గణాంక దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక ప్రణాళికా రంగంలో మహలనోబిస్ చేసిన కృషికి గుర్తింపుగా జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.