KMM: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ అన్నారు. సత్తుపల్లి ద్వారకపూరి కాలనీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. అనారోగ్యంతో బాధపడే వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారన్నారు.