SRPT: జిల్లాలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులంతా అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు సూచించారు. ఇవాళ జరిగిన ప్రజావాణిలో 44 దరఖాస్తులు స్వీకరించబడ్డాయని తెలిపారు. వీటిలో భూ సమస్యలకు సంబంధించినవి 26, ఇరిగేషన్ శాఖకు 4, సంక్షేమ శాఖకు 3, ఎంపీడీవోలకు 2, ఇతర శాఖలకు సంబంధించి మిగిలిన 9 దరఖాస్తులు వచ్చాయని వారు తెలిపారు.