NRML: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 మండలాల పరిధిలోని 131 గ్రామ పంచాయతీలు, 1170 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్కు అవకాశం ఉంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా నాయకులు తమకే విజయం వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.