AP: శ్రీశైలంలోని ATMలు పనిచేయకపోవడంతో మల్లన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్వర్క్ సమస్యతో మెషీన్ల నుంచి డబ్బు డ్రా చేసేందుకు వీలు లేకుండా పోయింది. దర్శన టికెట్లు కొనుగోలుకు డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారాంతం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి రాగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతున్నారు.