NZB: ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవారం డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మొక్కజొన్నకు ఎంఎస్పీ చెల్లించకుండా వ్యాపారులు కృత్రిమంగా రూ.1,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.