KNR: సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ను అక్రమంగా అరెస్ట్ చేయటం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. ప్రజాపాలన అంటూ రాక్షస పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు సరైన సమాధానం చెబుతారని అన్నారు.